నిజామాబాద్ A9 న్యూస్:

నందిపెట్ మండలం కుధ్వాన్ పూర్ గ్రామంలో శైలజా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతోపాటు, బిపి, కల్పోస్కోపి స్కానింగ్ తీయబడటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలు రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మహిళలకు వైద్యురాలు శైలజా వెల్లడించారు. తమ గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు గ్రామ ముస్లిం కమిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని సన్మానించారు. 

 

ఈ కార్యక్రమంలో శైలజా హాస్పిటల్ వైద్యులు మహమూద్ గ్రామ ముస్లిం కమిటీ అధ్యక్షుడు జావేద్, మౌలానా ఫిరోజ్ సహబ్, వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *