నిజామాబాద్ A9 న్యూస్:

ఇందల్వాయి మండలం తిర్మంన్ పల్లి గ్రామానికి చెందిన చేన్న శ్రావణికి ఆరు సంవత్సరాల క్రితం నిజామాబాద్ పక్కన గల నాగారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ తో ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు. జీవనోపాధి నిమిత్తం లక్ష్మణ్ శ్రావణిలు పిల్లలతో కలిసి తీర్మాన్ పల్లీగ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో తాగుడికి బానిస అయిన లక్ష్మణ్ నిత్యవసర వస్తువులు తేకుండా, ఇంటి అద్దె చెల్లించకుండా భార్యతో తరచూ గొడవపడేవాడు.. ఈ క్రమంలో మూడవ తారీకు అనగా మంగళవారం రోజున భార్యతో గొడవపడి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనగా అలా అయితే నేను చచ్చిపోతాను అని శ్రావణి చెప్పింది.. చచ్చిపోతే చచ్చిపో అని లక్ష్మణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

ఆ ఆవేశంలో శ్రావణి అద్దేకి ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.. శ్రావణి పెద్ద కూతురు సంయుక్త పరిస్థితి గమనించి విషయం పెద్ద వాళ్లకు తెలుపగా వారు శ్రావణిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు… అక్కడ చికిత్స పొందుతూ ఆమె నిన్న రాత్రి 11 గంటలకు మృతి చెందడం జరిగింది.

ఘటనపై మృతురాలి తల్లి చిన్న రాజమణి అల్లుడు లక్ష్మణ్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *