నిజామాబాద్ జిల్లా A9 న్యూస్.

నందిపేట మండల కేంద్ర లోని శ్రీ ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లో సోమవారం ఉదయం 7-35ని: సమయంలో నవీపేట గ్రామానికి చెందిన గూడూరు రిషిత వయసు 4 సంవత్సరాలు, తన తండ్రితో పాటు సూపర్ మార్కెట్లోకి వెళ్ళింది. చాక్లెట్స్ కావాలని ఫ్రిడ్జ్ డోర్ దగ్గరికి వెళ్లి తాకిన వెంటనే కరెంటు షాక్ తలిగి కదలిక లేకపోవడంతో పక్కనే ఉన్న తన తండ్రి గమనించి చిన్నారిని లాగేసుకొని చూసేసరికి స్పృహ తప్పిపోయింది. వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. రిషిత కరెంట్ షాక్ వల్ల చనిపోయినట్టు ధ్రువీకరించారు. వందల పదిమంది షాపింగ్ కొరకు వచ్చే సూపర్ మార్కెట్లో కనీస రక్షణ చర్యలు లేకుండా నిర్వర్తిస్తున్న షాపింగ్ మాల్ నిర్వాహకులు అలసత్వం వల్ల అమాయక చిన్నారి ప్రాణాలు బలయ్యందని, పాప చనిపోవడానికి కారకైన పై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రజలు కోరుకుంటున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *