నిజామాబాద్ A9 న్యూస్:  

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనలో భాగంగా 3వ తేదీన నిజామాబాదుకు రానున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పెద్దోళ్ల గంగారెడ్డి, బిజెపి నిజామాబాద్ కార్పొరేటర్ బంటు రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే రానున్న రోజుల్లో కార్యకర్తలు సైనికులవలే పనిచేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని అలాగే కేసీఆర్ చేస్తున్న అవినీతి వైఫల్యాలను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, ఆర్మూర్ అసెంబ్లీ ప్రబారి నందా రెడ్డి, పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్,ఆర్మూ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, అసెంబ్లీ నాయకులు రాకేష్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్ వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *