నిజామాబాద్ A9 న్యూస్:

జక్రాన్ పల్లి మండలం, అర్గుల్ గ్రామంలోని 11వ వీధిలో సార్వజని గణేష్ భజన మండలి ఆధ్వర్యంలో గణేష్ మండలి వద్ద, మంగళవారం గణేష్ మండలి నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు, ప్రజలు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి వంటకాలు చేసి నైవేద్యాలను సమర్పించారు,అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు అధ్యక్షుడు, గుత్ప గంగాధర్, క్యాషియర్ వినోద్ కుమార్,విగ్రహా దాత చుక్కయ్యగారి చిరంజీవి, సబ్యులు శివ, సంజీవ్,కిషన్ శేఖర్,సుమన్ గ్రామ,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

గంగపుత్ర సంఘ సభ్యులకు సహాయ సహకారాలు అందించిన దాతలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *