నిజామాబాద్ A9 న్యూస్:

భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) ఆర్మూర్ మండల శాఖ అధ్యక్షులు సాయి రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి క్లాక్ టవర్ దగ్గర ఉన్న జాతీయ పతాకం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఉంచి మిఠాయిలు పంచుతూ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.

 

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ…

 

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, బిఎంఎస్ కార్మికులకు ఈ దేశ ప్రజలందరికి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో మళ్ళీ భారత ప్రధానిగా నియామకమై దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మార్చి ప్రతి వ్యక్తికి భారత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయాలని. ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా వెలుగొందాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ని ఎన్నుకోవాలని. ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

 

 

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బిఎంఎస్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *