తెలంగాణ A9 news:

ఇవాళ టెట్ పరీక్ష నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. అన్నిసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 4,78,055 మంది అభ్యర్థుల కోసం 2,052 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పరీక్ష సెంటర్లుగా నిర్ణయించిన స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ ల పరీక్షలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *