నిజామాబాద్ A9 న్యూస్:

బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం నుంచి 42 కుటుంబాలు ఆదివారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ మత్స్యకారులు సంఘ సభ్యులు సర్పంచి చాట్లపల్లి వనజ-గోవర్ధన్ గౌడ్ కు తీర్మానం పత్రాలను అందజేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఓటు వేస్తామని ప్రమాణం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు మర వకుండా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు చిట్టాపూర్ గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించేందుకు పూర్తిమద్ధతు పలుకుతామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *