నిజామాబాద్ A9 న్యూస్:

ఏఐసిసి ప్రకటించిన ఎన్నికల కమిటీలలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులకు భారీగా అవకాశాలు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా షబ్బీర్ అలీ ని, వైస్ చైర్మన్గా ఈరవత్రి అనిల్ ని, సభ్యులుగా గడుగు గంగాధర్ ని నియమించడం జరిగింది.

    అదే విధంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తాహేర్ బీన్ హంధాన్ ని, చార్జిషీట్ కమిటీ మెంబర్లుగా సౌదగర్ గంగారం ని, అన్వేష్ రెడ్డి ని, కమ్యూనికేషన్ కమిటీ ఉపాధ్యక్షులుగా మదన్ మోహన్ రావు ని, సభ్యులుగా ఆవేసుద్దిన్ ని, స్టాటర్జి కమిటీ సభ్యులుగా జీవి రామకృష్ణ (అడ్వకేట్) ని నియమించడం జరిగింది.

   ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *