నిజామాబాద్ A9 న్యూస్:

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మేను జయప్రదం చేయాలని అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు పిలుపు మేరకు.

 

ఆర్మూర్ పట్టణంలో అంగన్వాడి సమ్మె పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమ్మెను విచ్చినం చేయడానికి అధికారులు, ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని, కుట్రలను తిప్పి కొట్టి అంగన్వాడి ఉద్యోగులు ఐక్యంగా హక్కుల కోసం సమ్మెలో పాల్గొనాలని తెలిపారు.

పెరుగుతున్న ధరలకు అనుకూలంగా అంగన్వాడి ఉద్యోగులకు 26వేల రూపాయల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ఆర్మూర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు చంద్రకళ, కార్యదర్శి గోదావరి, నాయకులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *