నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. నరసింహస్వామి ఆలయంలో పప్పలారం నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు శనివారాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులు పప్పలారం సమర్పించి మోక్కులు చెల్లించుకుంటారని అన్నారు.

లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో యావత్ ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పాడి పంటలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *