నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆది, సోమవారాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన జాతీయ రహ దారిపై మహాలక్ష్మి గుడి ఏరియాలో భారీగా నిలిచిన వరద ప్రాంతాల్లో సోమవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు.

భారీ వర్షాలతో ప్రధాన జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరును త్వరితగతంగా క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట బీఆర్ ఎస్ నాయకులు, ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, ఆకుల రజనీష్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *