నిజామాబాద్ A9 న్యూస్:

 

ఆర్ముర్ పట్టణములోని జడ్.పి.హెచ్.ఎస్ జంబి హనుమాన్ మరియు ఎం పి యు పి ఎస్ పాఠశాలలో స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు. 18 సంవత్సరాలు పూర్తియినా యువత తప్పకుండ ఓటరు నమోదు చేసుకోవాలని, అలాగే డ్రాప్ట్ రోల్ నందు ఓటర్ల వివరాలు సరిగా చూసుకోవాలని ఏమైనా వివరాలు తప్పుగా ఉన్నచో సవరణ కోసం 8 నంబర్ ఫారం ద్వారా నేరుగా సంబంధిత బి ఎల్ ఓ, లకి అందజేయాలి లేదా మొబైల్ ఆప్ లో ఓటర్ హెల్ప్ లైన్ లేదా ఎన్ వి ఎస్ పి ఆన్లైన్ పోర్టల్ ద్వారా అర్జీ చేసుకోవచ్చని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్ మరియు రెవెన్యూ సిబ్బంది, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *