నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది, నిజామాబాద్ సహా గ్రామాలలో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది.

 

రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు.

తెల్లవారుజాము నుండి కురుస్తున్న కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *