నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన మినీ కళ్యాణం మండప ప్రారంభోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది.

 

ఈ సందర్భంగా మండపంలో యజ్ఞ హోమ కార్యక్రమాలు, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండప ప్రారంభోత్సవంలో పాల్గొని దాతలు అనసూయ మారుతి,రేణుక జువెలర్స్ సంతని గణేష్ లను అభినందించారు. ఈ సందర్భంగా దాత మారుతి దంపతులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని, సర్వ సమాజ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం సర్వసమాజ్ సభ్యులు దాత మారుతి దంపతులు,రేణుక గణేష్ లను ఘనంగా సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాత దొండి అనసూయ మారుతి ముందుకొచ్చి కళ్యాణ మండపాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు. త్వరలోనే మండప ఆవరనలో ప్రజల సౌకర్యార్థం భోజనశాల నిర్మిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ డార్లింగ్ రమేష్, సర్వసమాజ్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *