నిజామాబాద్ A9 న్యూస్:

తెలంగాణా విద్యార్ధి పరిషత్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు అఖిల్ అధ్వర్యంలో నగరంలోని సత్య ఒకేషనల్ కళాశాలలో రాఖీ పండగ పురస్కరించుకొని విద్యార్థినీలతో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు రాఖీ కటిచుకొని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.ఈసందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల రక్షణకోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కంకణ బద్దులై ఉంటారని వారి రక్షణ కోసం నిరంతరం పాటుపడుతామని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులలో మహిళలకోసం ఎన్ని చట్టాలు రూపొందించిన దాడులు ఆగడం లేదని,మహిళలపై దాడులు అగలి అంటే సమాజంలో సోదరభావం పెంపొందించాలని, మనుషుల్లో మానసిక పరివర్తన వల్లే ఏటువంటి మార్పు సాధ్యమని దానికి వెదికే ఈ రక్ష బంధన్ కార్యక్రమం అని తెలిపారు. కళాశాలలో చదివే అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికి ఒకరు రక్షణగా సోదరా భావంతో వుండాలని పిలుపునిచ్చారు.

అమ్మాయిలకు ఈవ్టీజింగ్, సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ లాంటివి ఇబ్బంది పెడితే టీజీవిపి కి తెలియజేస్తే షి టీమ్ వారి సహకారం తో మీకు అండగా ఉంటామని తెలిపారు.అనంతరం మిఠాయి పంచారు ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు కార్యక్రమంలో మహేష్, సోహేల్ సుజిత్ ఇమ్రాన్ అయాన్ అదీబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *