నిజామాబాద్ A9 న్యూస్:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చే అద్భుతంగా నిర్మించబడిన యాదగిరి పుణ్యక్షేత్రాన్ని ఆర్మూర్ ప్రజలు ఇక మీదట ఉచితంగా దర్శించుకోనున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో యాదగిరి గుట్ట దర్శనానికి ఆసక్తి ఉన్న గ్రామాల ప్రజల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి స్వయంగా బస్ ఏర్పాటు చేశారు. సోమవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని వన్నెల్ కె గ్రామం నుండి గ్రామస్థులు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లారు.

వీరిని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని రావాలని వారిని యాదగిరిగుట్టకు సాగనంపారు. అంతకుముందు సోమవారం ఉదయం ఆర్మూర్ పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్ట పై దర్శనం చేయించి, అల్పాహారం ఏర్పాటు చేయించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారికి అందించారు. చరిత్రాత్మక కట్టడం యాదగిరి గుట్ట దైవ దర్శనానికి వెళ్లే ఆర్మూర్ నియోజకవర్గంలోని భక్తుల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సొంత ఖర్చులతో ఉచితంగా బస్ ఏర్పాటు చేయడం పట్ల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు సంతోషం వెలిబుచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *