నిజామాబాద్ A9 న్యూస్:

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది దీనితో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన సందర్భంగా ఆర్మూర్ సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు కె.సి.ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యొక్క సేవలను గుర్తించి తమను రెగ్యులర్ చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు చిన్నయ్య, రవి, షీలా రాణి ,శిరీష, ఆర్మూర్ బాలికల పాఠశాల నుండి స్వర్ణలత, ధనలక్ష్మి, సుహాసిని ,అనిత ,ప్రసన్న తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *