నిజామాబాద్ A9 న్యూస్:

నిర్మల్ లో రైతుల దీక్షకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. 

 

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ లో మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములను కమర్షియల్ భూములుగా మార్చి రైతులను అన్యాయం చేసే ప్రక్రియ కొనసాగుతుందని, దీనికి వ్యతిరేకంగా అక్కడి రైతులతో పాటు బిజెపి మాజీ శాసనసభ్యులు నిరావధిక సమ్మెను నిర్వహిస్తున్నారని, సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళ్లడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోల్ల గంగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, నాయకులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *