*🔷 జిల్లాలో భూ కబ్జాలను అరికట్టాలి*

 

*🔷 అమాయకుల భూములకు రక్షణ లేదు*

 

*🔷 జిల్లా కలెక్టర్ను కలిసిన బీజేపీ నేత బుస్సాపూర్ శంకర్*

 

జిల్లా లో అమాయక ప్రజల భూములకు రక్షణ లేకుండా పోతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు బుస్సాపూర్ శంకర్ అన్నారు.

 

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ను కలిసిన బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో కోయల్కర్ జలోజి గారి 19 గుంటల భూమి కబ్జాకు గురైందని వారు గత 2 సంవత్సరాలుగా అధికారులకు విన్నవించుకుంటున్న పని పూర్తవ్వడం లేదన్నారు.

 

అదే విదంగా అమాయక ప్రజల వద్ద కనీసం వంద గుంటల భూమి కూడా మిగల్చకుండా , అమాయక ప్రజల వద్ద నుంచి భూ బాకా సురులు భూమిని కాజేస్తున్నారన్నారు.

 

ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయని

 

కలెక్టర్ గారు సత్వరమే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *