భారత్ పై వెస్టిండీస్ విజయం

 

 

బ్యూరో :ప్రతినిధి

 

బ్యూరో :ఆగస్టు 14
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అమెరికా వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అందులో సూర్య 61, తిలక్ 27, మినహా ఎవరూ సరిగా రాణించలేదు. అలాగే మంచి దూకుడు లో ఉన్న సూర్యకు వర్షం పలుమార్లు బ్రేకులు వేసింది.

కాగా 166 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించారు. దీంతో ఐదు టీ20 ల సిరీస్ 3-2 తేడాతో టైటిల్ ను కైవసం చేసుకున్నారు.

కాగా ఈ సిరీస్ ఓటమితో భారత్ 17 ఏళ్ల తర్వాత విండీస్ జట్టుపై తొలి సిరీస్ ను కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *