*రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి…
*హాజరైన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, సదాశివనగర్ సిఐ సంతోష్….
A9 న్యూస్ ప్రతినిధి గాంధారి:
నూతన పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ ను బుధవారం ఉదయం సందర్శించడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఎస్పీకి ఎస్సై ఆంజనేయులు, ఎఎస్సై, కానిస్టేబులతో పాటు గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. అటుపై రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వర త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో వీసబుల్ పోలీసులు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, సదాశివ నగర్ సిఐ సంతోష్ పాల్గొనడం జరిగింది.