A9 న్యూస్ ప్రతినిధి:
సదాశివ నగర్ మండల్ మొడేగం గ్రామంలో ఎంపీ యుపిఎస్ మోడెగాం పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడ్కోలు సమావేశానికి హాజరైనటువంటి కల్వరాల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జై విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించడం జరిగింది.ఈ సమావేశంలో మోడెగాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.