నిజామాబాద్ A9 news

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ లో శుక్రవారం రెండు పడకల ఇండ్లు విషయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడినే చేస్తానని, రాష్ట్రంలో ఉన్నా దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తానని దళితులను నమ్మించి దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క దళితునికి రెండు పడకల ఇల్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ హిందూధర్మ సంప్రదాయం ప్రకారం నూతన గృహ ప్రవేశానికి మేక, కల్లు, గుడాలు, డప్పు సప్పట్లతో పార్టీ కార్యాలయం నుండి నిఖిల్ సాయి చౌరస్తా వరకు వెళ్లి నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ దళితులకు రెండు పడకల ఇండ్లు ఇస్తానని మోసం చేసిన కేసిఆర్ మళ్ళోసారి దళితులకు గృహలక్ష్మి ఇండ్లు ఇస్తానని మోసం చేయడం జరుగుతుందని దళితులందరు కేసీఆర్ మాట నమ్మి మళ్ళోసారి మోకపోకండని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందీప్, ఆర్మూర్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బ్యావత్ సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, పులి యుగంధర్, కుమారస్వామి, సాయి, ఎడ్ల బాలకృష్ణ, సాయినాథ్ పవర్, గౌతమ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *