*రేపు తెలంగాణలో బంద్కు పిలుపు?*
A9 న్యూస్ భద్రాద్రి ప్రతినిధి:
*రేపు తెలంగాణలో బంద్కు పిలుపు..?
*అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు..
తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది..ఈ నెల 9న బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఆయన తన పేరుతో మీడియాకు శుక్రవారం లేఖను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపుని చ్చారు. నవంబర్ 30న చెల్పాక పంచాయతీలోని ఓ వలస ఆదివాసీ గ్రామం లో ఏడుగురు సాయుధుల ను అధీనంలోకి తీసుకుని దగ్గరి నుంచి అతి కిరాత కంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తారు.
ద్రోహి ఇచ్చిన సమాచారం తో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా. ఏటూర్ నాగారం మండలం, చెల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు.
నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్చాక పంచాయితీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయ మని చెప్పారు. ముందుగా నే పోలీసులకు అప్రోవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృృహం కోల్పోయే లాగా చేశారు.
స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు. శత్రువు మోస పూరిత పథకంలో చిక్కి అమూల్య మైన కామ్రేడ్స్ కురుసం మంగు అలియాస్ పాపన్న, బద్రు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, కోటి తో పాటు…
జెఎండబ్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు ముచాకీ అందాల్ అలియాస్ కరుణాకర్ ఇల్లెందు- నర్సంపేట్ ఏరియా కమిటీ సభ్యుడు ముచాకీ బూమే అలియాస్ జమున ఏరి యా కమిటీ సభ్యురాలు పూనెం చోటు అలియాస్ కిషోర్…
రీజినల్ కంపెనీ -2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడు, కర్టం కామాల్ రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ నభ్యు డు,కామ్రేడ్ జైసింగ్ ఏటూర్ నాగారం-మహదేవ్ పూర్ ఏరియా దళం నభ్యుడు లు ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది’అన్నారు.