A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి:

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ పండుగ వేడుకల్లో భాగంగా గ్రామంలో ఎల్లమ్మ కు తల్లికి బోనాలు సమర్పించారు గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు తీరుస్తుందని వారి నమ్మకం డప్పు వాయిద్యాలతో డిజె సప్పుల మధ్య నాలుగు మూలల నుండి బోనాలను ఊరేగింపు తీసుకువెళ్లి అమ్మవారి వద్ద ప్రతిష్టాపించారు రేణుక ఎల్లమ్మ తల్లి భూంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ గుడిని చూడడానికి మరియు ఆట చూడడానికి చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో ఎక్కడ చూడని విధంగా భూంపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుడి నిర్మించారని వివిధ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు గ్రామంలో ఎల్లమ్మ గుడి కట్టాలని వచ్చిన ఆలోచన ఎంతో సంతోషకరమని భూంపల్లి గ్రామస్తులు గౌడ్ సంఘ సభ్యులను అభినందిస్తున్నారు. భూంపల్లి గ్రామం ఎల్లమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది గ్రామస్తులతో పాటు బంధువులు రావడంతో ఇండ్లన్నీ కళకళలాడాయి. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘ సభ్యులు మరియు భూంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *