A9 న్యూస్ తూప్రాన్ మెదక్ నవంబర్ 13

గ్రాడ్యూయెట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ల ఓటరు నమోదుకై తేది 06.11.2024 తో నమోదు ప్రక్రియ ముగిసినందున, ఇప్పటి వరకు తూప్రాన్ డివిజన్ లో గ్రాడ్యూయేట్స్ (3013) మరియు టీచర్స్ (271) ఎమ్మెల్సీ ల ఓటరు నమోదుకై దరఖాస్తు చేసుకున్నారనీ తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రా రెడ్డి తెలియ జేశారు. ఇప్పటి వరకు వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎమ్మెల్సీ కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ నియోజక వర్గ ఈఆర్వోగా ఓటర్ రిజిస్ట్రేషన్ బాధ్యతలు చూస్తున్న కరీంనగర్ డిఆర్ఓ 23. 11.2024 తేది న ముసాయిదా ఎమ్మెల్సీ ఓటర్ జాబితాను ప్రకటిస్తారు.
అట్టి జాబితాలో ఏదైనా అభ్యంతరాలు గాని ఆక్షేపణలు గాని లేదా కొత్తగా ఓటు నమోదు కు 23.11.2024 నుండి 09.12.2024 లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనగా మరోసారి నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు ఓటర్ జాబితా లో నమోదు కు అవకాశం ఉంటుంది
కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగించుకోవలసిందిగా ఆర్డీవో విద్యావంతులను కోరారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *