A9, న్యూస్ ఆర్మూర్

 

ఈరోజు ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం చేపూర్ అధ్యక్షులు మేడిపల్లి గిరీష్, రాటం భూమన్నల ఆధ్వర్యంలో ఈరోజు ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన, మరియు ఆదివాసీ ప్రజలకు అడవి పై హక్కుల కోసం *జల్ జంగిల్ జమీన్* అనే నినాదంతో నైజాం సర్కారుతో పోరాడిన కొమురం భీం వీరుడి యొక్క 123వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో చేపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి నాయకపొడ్ సంఘ సభ్యులు 50 మంది వరకు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *