A9 న్యూస్ తెలంగాణ:

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

అకాల వర్షాలు, వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచెనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్రబృందాన్ని సెప్టెంబర్ 11న పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు.. వరద వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్ తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. ఈ సందర్భంగా.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ తో ఫోన్లో మాట్లాడి.. ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితులు ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *