A9 న్యూస్ ఆర్మూర్:

లిల్లీపుట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అందరూ చక్కగా ఉపాధ్యాయ వేషంలో వచ్చి చక్కగా పాఠ్యాంశాలుబోధించారు అంతేకాకుండా విద్యార్థులందరూ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చేవాడు ఉపాధ్యాయుడని పేర్కొన్నాడు అదేవిధంగా ప్రిన్సిపాల్ దాసు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుందని సర్వేపల్లి రాధాకృష్ణ గురించి విద్యార్థులకు తెలియజేశారు తదనంతరం తమ పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ,  ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *