A9 న్యూస్ ప్రతినిధి నందిపెట్: 

ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా తెలంగాణది ఆజన్మ బ్రహ్మచారిగా తన జీవితమంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారకులు జయశంకర్ అని, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని విద్యార్థి నాయకుడిగా నినాదం చేతపట్టి ప్రొఫెసర్గా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా ఎదిగి రాష్ట్ర సాధనలో ప్రముఖుడిగా నిలిచాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి, నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పిటిసి ఎర్రం ముత్యం, జిల్లా మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మల్ రాజన్న, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, బాలగంగాధర్, బొడ్డు రాజశేఖర్, కానూరి గంగాసాగర్, సతీష్, భరత్, భాస్కర్, ప్రభాకర్, సంజీవ్, మనోజ్, రాజు గౌడ్, సాయిలు, నరేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *