ఉత్తర ముఖ శివాలయం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు 

 

 

సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ ప్రతినిధి

భీమ్ గల్ ::జూలై 21 : భీమ్ గల్ మండలంలోని ఆయా గ్రామాలలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువుల పూజోత్సవ కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాబానగర్ లోఉత్తరముఖ శివాలయం శ్రీ శ్రీ గంగానంద్ మహారాజ్ ఆశ్రమంలో ఉదయం నుండి వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని పూజ, యజ్ఞం కార్యక్రమాలను నిర్వహించి అనంతరం గురువులకు పాదాపూజా జరిపి, భక్తిగితాలు ఆలపించారు. ఆశ్రమ ప్రాణంగాణామంతా కీర్తనలతో మారుమ్రోగింది.. అనంతరం ఆశ్రమంలో భక్తుల సౌకర్యార్థం మేరకు అన్న ప్రసాదాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో , ఆశ్రమ నిర్వాకులు, దేవుడు రాజన్న, యమున, ఆలయ కమిటీ సభ్యులు, తోట రాజ గంగారాం, రాజన్న, సుమంగళి శ్రీనివాస్, హరి కృష్ణ, సుదర్శన్,గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *