A9 న్యూస్ ప్రతినిధి:

శ్రామిక వర్గ విముక్తికై, ఆలాపన, చేయడమే కానూరి కి నిజమైన నివాళి అని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. కానూరి వెంకటేశ్వరరావు తొమ్మిదవ స్మారక సభను మాక్లూర్ మండలంలోని బొర్గాం(కే) గ్రామంలో శనివారం నిర్వహించారు.

జననం మరణం సహజమే కానీ జీవితాంతం జనం కోసం జీవించడం, ఉన్నతమని కానూరి సాంస్కృతిక సైనికాధిపతిగా పనిచేసి ప్రజా కళాకారులకు స్ఫూర్తిని ఇచ్చారని ఆయన తెలిపారు. 

ఇందిరమ్మ జైల్లో పెట్టిన తన కళం స్వరం ప్రజలపక్షమేననీ

నిరూపించారని ఆయన తెలిపారు. కళ కాసుల కోసం కాదని, అనేక అవకాశాలు వచ్చిన, విస్మరించి, పీడిత జన రాగ మై అరుణోదయ కీర్తిని ఆకాశానికి ఎత్తాడని ఆయన తెలిపారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అరుణోదయ గలం, ఆలాపన కొనసాగుతూనే ఉంటుందని దాసు అన్నారు. 

ఈ సభలో అరుణోదయ, ప్రజా సంఘాల నాయకులు దెశెట్టి సాయి రెడ్డి, కృష్ణా గౌడ్, శంకర్, నాగేష్, గంగాధర్, రాధా, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *