A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

ఆధాబ్ హైదరాబాద్/ ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక 9 కుల సంఘ సభ్యులతో శుక్రవారం నిర్వహించరు. గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నికలలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా అన్ని కులాల సంఘ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగ మేడిపల్లి శ్రీకాంత్ సంఘ సభ్యున్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు, ఉపాధ్యక్షుడిగా కుస్తాపురం నడిపి నర్సారెడ్డి కోశాధికారిగా సురేష్ రుక్మాజి, ముఖ్య సలహాదారుడిగా బొబ్బిలి బోర్రన్న, ప్రధాన కార్యదర్శిగా కంపదండి వినోద్ లను ఎన్నుకొన్నారు.

ఈ సందర్బంగా అధ్యక్షునిగా ఎన్నికైన మేడిపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ అభివృద్ధి కమిటీ కృషి చేస్తుందినని గ్రామ అభివృద్ధి కమిటీ అభివృద్ధి కొరకు పాటుపడతామని ఎలాంటీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరికి జరిమానాలు గాని భూతగాదాలు గానీ కొట్లాట సమస్యలు గానీ జరిమానాలు కానీ తీయమని, వారు తెలిపారు. గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామ సమస్యలను ప్రభుత్వ అధికారుల ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామ సమస్యలు శాంతియుతంగ పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో గ్రామ కుల సంఘాల పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *