దేశం లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే —అనిల్ ఈరవత్రి ===

సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు,మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన సంఘాల యువకులు దాదాపు వంద మంది కాంగ్రెస్ లో చేరిక. .

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరెపల్లి నాగేద్రబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి . 

ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి గారు మాట్లాడుతూ. .

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవడం కోసం అందరూ ఒక్కతాటిపై ఉండి కష్టపడాలన్నారు

కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు దొరకడం కరువయ్యారు

దేశంలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది

అందరికీ సమానత్వ పరిపాలన అందుతుందని అన్నారు. ..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *