A9 న్యూస్ ప్రతినిధి సుంకరిగంగా మోహన్

ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్ ప ఫారం ధర్మారం గ్రామాలను తాగునీటిపై శనివారం మండల స్పెషల్ ఆఫీసర్ నందకుమారి సందర్శించి పంచాయితీ సెక్రటరీలకు పలు సూచనలు చేశారు అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎడపల్లి ఎంపీడీవో గోపాలకృష్ణ తో కలిసి మాట్లాడారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు నీటి సమస్యలపై ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టి తాగునీటి సప్లై కొరతలు లేకుండా ప్రణాళిక బద్ధంగా చూడాల్సిందిగా ఆదేశాలు ఉన్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు నీటి ఎద్దడి ఉన్నట్లయితే గ్రామాల్లో ఉన్న వ్యవసాయ బోరువాలను అగ్రిమెంట్ చేసుకుని గ్రామ అవసరాలు తీర్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని వారు గ్రామపంచాయతీ కార్యదర్శులను కోరారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏ ఈ గబ్బర్ సింగ్ గ్రామపంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *