A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: 

భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతిని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ అరుంధతి నగర్ మార్గంలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది.

బాబు జగ్జీవన్ రామ్ యొక్క ఆశయాలను, ఆదర్శాలను ప్రతి వ్యక్తి పునికి పుచ్చుకొని రాబోయే కాలంలో దీన, దళిత, పేద ప్రజలను అభివృద్ధి చేయడానికి ఏ విధంగా అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకొని సబ్కా సాత్, సభ్ కా వికాస్ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా రాబోయే కాలంలో భారత ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీని ఎన్నుకొని బాబు జగ్జీవన్ రామ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడమైనది.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ గిరిజన మొర్చ కన్వీనర్ కొర్ర గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు పాన్ శ్రీను, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు దొండీ ప్రకాష్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణామూర్తి, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *