A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో హోలీ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు రంగులు వేస్తూ ఆటపాటలతో ఎంతో సందడి చేశారు. వివిధ రకాల రంగులతో హోలీ ఆడారు విద్యార్థులు అందరూ చక్కగా. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ భారత దేశంలో అతి ముఖ్యమైన పండుగ హోలీ అని ఇది రెండు రోజులు జరుపుకుంటారని మొదటి రోజున సాయంత్రం హాలిక దహనం చేస్తారని చిన్నలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా రంగులతో ఆడుకుంటారని విద్యార్థులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారులందరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *