నిజామాబాద్ A9 న్యూస్ ఫిబ్రవరి 22:

* బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వేదిక జిల్లా కార్యవర్గం ఎన్నిక

* జిల్లా అధ్యక్షునిగా సుంకం భూషణ్, ప్రధాన కార్యదర్శులుగా ఆప్కారి రాజన్న, ఉషమ్ జై రాం

* నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ 

నిజామాబాద్ బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వేదిక జిల్లా కార్యవర్గాన్నీ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ ప్రకటించారు.

గురువారం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలకు రాజకీయాలకు అతీతంగా వెనక బాటుకు గురైన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలన్నారు 

ఈ మేరకు వేదిక జిల్లా అధ్యక్షునిగా సుంకం భూషణ్ ని నియమించి అభినందించారు. అనంతరం

జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ఆప్కారి రాజన్న, ఉషమ్ జై రాం, జిల్లా ఉపాధ్యక్షులుగా కారం పూరి రవి కుమార్, రాథోడ్ సుందర్ సింగ్, గొల్లపల్లి జగన్ గౌడ్, వడ్లూరి శైలజ, రజక సంగం సాయిలు జిల్లా అధికార ప్రతినిధిగా బాలేకార్ మనీష్ తేజ, కార్యదర్శులుగా వై.అనిల్ కుమార్, చింతకింది సంతోష్, కుంచెపు ఆనంద్, సరిచంద్ మేఘవత, చిన్నజీ నవీన్నూ కార్యనిర్వాహక కార్యదర్శి గా నియమించి నియామక పాత్రలు అందించారు.

 వేదిక బలోపేతానికి కృషి చేయాలని పదాదికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *