నిజామాబాద్ A9 న్యూస్:

ప్రజాపాలన కార్యక్రమంతో ఆరు గ్యారంటీలను అమలుపరుస్తూ ప్రజలకు భద్రతను, భరోసాను కల్పిస్తాం ప్రజాపాలనలో భాగంగా పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు 30వ వార్డులో దరఖాస్తు ఫారంలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పట్టణ B.C సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ మాట్లాడుతూ పేద ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకం ద్వారా ఆరు గ్యారంటీలను అమలుపరచడంలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమలు చేసే ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ సందర్శనలో భాగంగా 30వ వార్డులో శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా తెలియజేశారు. ప్రతీ ఒక్క పేదవాడి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సంక్షేభంలో ఉన్న తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేసి సంక్షేమం వైపుగా నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలన అధికారులు ఉదయ, ఆర్ పి దొండి గంగమణి, పద్మ అంగన్వాడి ఆఫీసర్ గోపి, కాంగ్రెస్ నాయకులు పింజ అభినవ్, రాజ్, తోపారం భగత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *