హైదరాబాద్ A9 న్యూస్:

హైదరాబాద్: 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాల పై ప్రజలకు వాస్తవాలు చెబుదాం. తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలి. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా బడ్జెట్పై కసరత్తు జరగాలి. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్ రూపకల్పన జరగాలి.

దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ఉండాలి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలకు పోవద్దు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న వాటినే వాడుకోవాలి” అని సీఎం అధికారులకు సూచించారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *