నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ లొ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 48 గంటల్లోఎ రెండు పథకాలను ప్రారంభించినఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. దశలవారీగా పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. గత ప్రభుత్వ హాయంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, పది లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్మూర్ ఆర్టిసి ఆర్ ఎం ఓ సరస్వతి. అనంతరం కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందోత్సవాలను మధ్య గడిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *