తెలంగాణ A9 న్యూస్:  

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచివెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీ ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 119 నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 3వ తేదీ రోజు కౌంటింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *