కామారెడ్డి జిల్లా A9 న్యూస్:

సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి వెళితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని గ్రామస్తులు ఆనందంతో కాంగ్రెస్ కార్యకర్తల జోష్ నిండింది, ఒక మహిళ గైని భారతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లింగంపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో అప్పుడు ఇందూరమ్మ ఇల్లు కట్టిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రెండు పడకల ఇల్లు కూడా కట్టేయలేదని, అంతేకాకుండా దళిత బంధు ఒక్కరికే ఇచ్చారని, బీసీ బందు ఏ ఒక్కరికి రాలేదని బిఆర్ఎస్ నాయకులతో ఉన్న వ్యక్తులకే ఒక దళిత బందు వచ్చిందని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తులను నమ్మి కారు గుర్తుకు ఓటు వేయొద్దని తెలియజేస్తూ చేతి గుర్తుకు ఓటేస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *