జక్రాన్ పల్లి మండలంలోని గడ్డం పైపుల రాజరెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన విగహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి,
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంచి పనులు చేయడం అంటే ఇలాంటి వారి వల్లే అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు అయన చేసినటువంటి పనులు ముందు తరాల వాళ్ళు ఎప్పటికి మరువలేనిదని, అందరికి ఉపయోగ పడేలా పాఠశాల నిర్మించడం అనేది చిన్న విషయం కాదని అలాగే జక్రాన్ పల్లి వాసులు ఎల్లప్పుడూ ఆయన్ని గుర్తుంచుకునేలా ఆయన విగ్రహం పెట్టడం గర్వకారణం అని ఎమ్మెల్యే అన్నారు,అనంతరం ప్రభుత్వం నుండి వచ్చే ప్రతీ పథకం అందరూ వినియోగించుకోవాలని గత ప్రభుత్వం చేసింది ఏమి లేదని కేవలం పదవులు అనుభవించి ప్రజలను మోసం చేసింది అని ఆయన పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.