నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాజారాం నగర్ లో గల హరే రామ క్షత్రియ యువజన సంఘం సభ్యులు షికారి శ్రీనివాస్ పొహార్ నవీన్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. ఆర్మూర్ నియోజకవర్గం లోని అంకాపూర్ లో గల పైడి రాకేష్ రెడ్డి నివాసంలో హరే రామ యువజన సంఘం సభ్యులు దాదాపు 30 మంది బిజెపిలో చేరారు.

వారికి పైడి రాకేష్ రెడ్డి బిజెపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరే రామ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ధర్మం కోసం దేశం కోసం పాటుపడుతున్న బిజెపి పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి ఆకర్షితులై పార్టీలో చేరామని, తాము తమ శాయశక్తుల కృషిచేసి రాకేష్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటా మని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలో చేరిన వారి వివరాలు హరే రామ యూత్ అధ్యక్షులు నవీన్ బొచ్కర్, దిలీప్ కుమార్, దినేష్, చందన్, వినాయక్ డీకే, సూరజ్, వాగ్లే విగ్నేష్, వేణు, రాహుల్, సృజన్, అమర్, కిరణ్, శ్రీకర్, వేణు, రమేష్, రాము, శ్రీకాంత్, డి నవీన్, సాయి ప్రీతం, పవన్, రంజిత్ తదితరులు బిజెపిలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *