నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి కేంద్ర రక్షణ సహాయ మంత్రి అజయ్ బట్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మామిడిపల్లి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు.

ఆయనకు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరచకాలు పెరిగిపోతున్నాయని, భూకబ్జాలకు పాల్పడుతూ ఎస్సీలను హత్యలు చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇక్కడ ప్రజలను రాక్షస ఎమ్మెల్యే నుండి కాపాడడానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను వచ్చానని వ్యాఖ్యానించారు. బిజెపి అధికారంలోకి వస్తే ధర్మం నాలుగు పాదాలు పై నడుస్తుందని అన్నారు. బిజెపి అవినీతి పాలనను అంతం చేస్తుందని అన్నారు. అనంతరం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాస్, కంచ్చేట్టి గంగాధర్, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *