నిజామాబాద్ A9 న్యూస్:

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఇందూరు జిల్లా ప్రజల గురించి మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ లో, ఆర్మూర్ పట్టణంలోని బహిరంగ సభలకు ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ రానున్నారు.

కాంగ్రెస్ నేత ఏఐసీసీ అగ్ర నేత ఎంపీ రాహుల్ గాంధీ,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ, బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసేందుకు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్రలో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు, ఆర్మూర్ బాల్కొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృత ఏర్పాటు చేశారు.

రాహుల్ గాంధీ పాల్గొనే కార్నర్ బహిరంగ సభలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలను వారు కోరారు. ఇందూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం మొదట బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ లో, ఆ తర్వాత ఆర్మూర్ లో పెర్కిట్ హైవే నుండి ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగే బైక్ ర్యాలీతో ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రజలకు అభివాదం చేస్తూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ రానున్నారు.

ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాహుల్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇందూరు జిల్లా పోలీసులు ముందస్తుగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *