నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణం కేంద్రంలో రంగాచార్య నగర్ కాలనీలో సిద్దాపురం పాపన్న (50) ఆదివారం తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు, ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని రంగాచారి నగర్ లో మున్నూరు కాపు కులానికి చెందిన సిద్దాపురం పాపన్న కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటాడు.

శనివారం రాత్రి తర్వాత ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో మృతుడికి బలమైన గాయాలు తగిలి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంట్లో జరిగిన గొడవల్లో సిద్దాపురం పాపన్నను మర్డర్ చేసినట్లు రంగాచారి నగర్ లోని స్థానికులు, ఆర్మూర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *