నిజామాబాద్ A9 న్యూస్:

ఇందల్వాయి మండలంలోని అన్ని దళిత సంఘాలు దళిత బంధు అక్రమాల నిరసన వ్యక్తం చేశారు.

దళిత సంఘాలు పూరి గుడిసెలు, కూలిన ఇండ్లు, సెంటు భూమి, లేని వాళ్ళకు దళిత బంధు ఇవ్వకుండా, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన వెంటే తెల్లవారితే తిరిగే వ్యక్తులను ఎంచుకొని వారికి భూములు, బంగ్లాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఉన్నవాళ్లకి ఇవ్వడం సరికాదు అని దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ముందు నిరసన వ్యక్తం చేశారు. 

తక్షణమే దళిత బంధువుని నిలిపివేయాలని అసలైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేనియెడల నిలిపివేయకపోతే త్వరలో కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి, సిర్నాపల్లి, నల్లవెల్లి, ఎల్లారెడ్డిపల్లి, మల్లాపూర్, తిర్మన్ పల్లి దళిత గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *